కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న గోపీచంద్ “భీమా”

కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న గోపీచంద్ “భీమా”

Published on Jan 29, 2024 6:37 PM IST


టాలీవుడ్ నటుడు గోపీచంద్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ఎ. హర్ష దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. ఈ చిత్రం తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ పై మేకర్స్ సరికొత్త ప్రకటన చేశారు. ప్రకటనలో విడుదల తేదీని ఫిబ్రవరి 16, 2024 నుండి మార్చి 8, 2024కి రీ షెడ్యూల్ చేసారు.

కొత్త విడుదల తేదీని వెల్లడించడానికి మేకర్స్ ఒక సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ప్రస్తుతానికి, ఈ చిత్రం రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మరియు విశ్వక్సేన్ యొక్క గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో క్లాష్ కానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌కి చెందిన కెకె రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కెజిఎఫ్ మరియు సలార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకి సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు