Thursday, April 25, 2024

TS: రాజన్న సన్నిధిలో భక్తుల సందడి..60 వేల మంది భక్తుల రాక…రూ. 40 లక్షల ఆదాయం

వేములవాడ (ఆంధ్రప్రభ): సుప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం సెలవు దినం కావడం తో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి దర్శనం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు వచ్చారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.

అర్చక స్వాములు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనం కోసం వచ్చిన భక్తులు ముందుగా స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 60 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 40లక్షల ఆదాయం సమకూ రినట్లు ఈ ఓ కృష్ణ ప్రసాద్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement