జ్యోతిష్యం నమ్మొద్దన్న భర్త.. మనస్థాపంతో భార్య ఏం చేసిందంటే..?

by Disha Web Desk 4 |
జ్యోతిష్యం నమ్మొద్దన్న భర్త.. మనస్థాపంతో భార్య ఏం చేసిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్ : పచ్చని కాపురంలో జ్యోతిష్యం చిచ్చుపెట్టింది. నూరేళ్లు భర్తతో కలిసి నడవాల్సిన భార్య అర్థంతరంగా తనువు చాలించింది. యూట్యూబ్‌లో తరచూ జ్యోతిష్యం చూసే వివాహిత తన భర్తతో విడిపోతానని బలంగా నమ్మడంతో పాటు భర్తకు ఇదే విషయాన్ని చెప్పింది. భర్త తీవ్రంగా కొట్టడంతో మనస్థాపంతో సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ కానాజిగూడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాఫ్ట్ వేర్ రాము(30), బబిత(28) భార్యాభర్తలు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నారు. జ్యోతిష్యం నమ్మవద్దని భర్త భార్యను పదేపదే కోరేవాడు. అయినా వినకపోవడంతో ఇటీవల కొట్టాడు. దీంతో మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు మాత్రం అదనపు కట్నం వేధింపులతోనే తమ కూతురు చనిపోయిందని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.



Next Story

Most Viewed