యాత్ర చరిత్రలో నిలిచిపోవాలి | Sakshi
Sakshi News home page

యాత్ర చరిత్రలో నిలిచిపోవాలి

Published Sun, Jan 7 2024 1:56 AM

-

వజ్రకరూరు: ఉరవకొండలో ఆదివారం నిర్వహించే సామాజిక సాధికార బస్సు యాత్ర చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన వజ్రకరూరులో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. వైఎస్‌ జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయ, నామినేటెడ్‌ పదవుల్లో అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సంక్షేమ పథకాల ద్వారానూ వారికి లబ్ధి చేకూర్చారన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు వేలాదిగా సామాజిక సాధికార యాత్రకు తరలిరావాలన్నారు.

Advertisement
Advertisement