విప్రో నుంచి మరో బైబ్యాక్‌

ABN , First Publish Date - 2023-04-24T01:18:38+05:30 IST

ఐటీ దిగ్గజం విప్రో మరోసారి షేర్ల బైబ్యాక్‌కు సిద్ధమవుతోంది. ఈ నెల 27న జరిగే కంపెనీ బోర్డు సమావేశం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.

విప్రో నుంచి మరో బైబ్యాక్‌

బెంగళూరు: ఐటీ దిగ్గజం విప్రో మరోసారి షేర్ల బైబ్యాక్‌కు సిద్ధమవుతోంది. ఈ నెల 27న జరిగే కంపెనీ బోర్డు సమావేశం దీనిపై నిర్ణయం తీసుకోనుంది. అదే రోజు కంపెనీ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించనుంది. 2020లోనూ విప్రో షేర్ల బైబ్యాక్‌ ప్రకటించింది. 2020 డిసెంబరు 29- 2021 జనవరి 11 మధ్య అమలైన ఈ షేర్ల బైబ్యాక్‌లో అజీమ్‌ ప్రేమ్‌జీ కుటుంబం 22.89 కోట్ల షేర్లను ఒక్కోటి రూ.400 చొప్పున కంపెనీకి విక్రయించి రూ.9,156 కోట్లు సంపాదించింది. గత ఏడాది కాలంగా విప్రో షేర్లు మార్కెట్లో వెలవెలపోతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ మళ్లీ షేర్ల బైబ్యాక్‌కు సిద్ధమవుతోంది.

Updated Date - 2023-04-24T01:18:38+05:30 IST