SRH VS CSK: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. హాజరైన CM రేవంత్ రెడ్డి

SRH VS CSK: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్.. హాజరైన CM రేవంత్ రెడ్డి

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు(ఏప్రిల్ 5) ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి హాజరయ్యారు. 

కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్‌ స్టేడియానికి చేరుకున్న రేవంత్‌ రెడ్డి.. స్టాండ్స్‌లో సినీనటుడు వెంకటేష్ పక్కన కూర్చొని ఆసక్తిగా మ్యాచ్ తిలకిస్తున్నారు. రేవంత్ రెడ్డిని స్క్రీన్ పై చూడగానే అభిమానులు.. 'సీఎం.. సీఎం' అంటూ నినాదాలు చేశారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.