- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
HYD : స్పా సెంటర్లపై దాడులు.. ఐదుగురు యువతులు అరెస్ట్
దిశ, మెహిదీపట్నం: క్రాస్ మసాజింగ్ చేస్తున్న స్పా సెంటర్లపై సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, గుడిమాల్కాపుర్ పోలీసులు సంయుక్తంగా కలిసి నానల్ నగర్ చౌరస్తాలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో జన్నత్ గోల్డెన్ అనే రెండు స్పా సెంటర్ల పై దాడి చేశారు. క్రాస్ మసాజ్ చేస్తున్న 5 మంది అమ్మాయిలతో పాటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పట్టుకున్న 5 మంది మహిళలు ఓ వ్యక్తి తో పాటు స్పా సెంటర్ల యజమానుల పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారని పోలీసులు చెబుతున్నారు. స్పా సెంటర్లు ఎక్కడ ఉన్నా భవన యజమాని వారిని ఖాళీ చేపియలని, లేని పక్షంలో వారి పైన కుడా తగిన చర్యలు తీసుకోవలసి వస్తుందని గుడిమల్కాపుర్ ఇన్స్పెక్టర్ ముజీబ్ రెహ్మాన్ హెచ్చరించారు. యువకులు ఎవ్వరూ కుడా స్పా సెంటర్ లకు గానీ, స్నూకర్ సెంటర్ల కు గాని రెక్రేశన్ క్లబ్ లకు వెళ్తే కేసులు నమోదు చేస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.