స్కూటీని ఢీ కొట్టి...బొలెరో వాహనంను బోల్తా కొట్టించి...మరొకరిని ఢీకొట్టి...

by Disha Web Desk 15 |
స్కూటీని ఢీ కొట్టి...బొలెరో వాహనంను బోల్తా కొట్టించి...మరొకరిని ఢీకొట్టి...
X

దిశ, మాచారెడ్డి : అతివేగం, అజాగ్రత్తగా వాహనం నడపడం వల్ల స్కూటీని ఢీ కొట్టి తప్పించుకునే ప్రయత్నంలో బొలెరో వాహనం బోల్తా పడి ఒకరి మృతికి కారణమైన ఘటన ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని భవానిపేట గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. బొలెరో వాహనం బోల్తా కొట్టిన ప్రమాదంలో ఉత్తర ప్రదేశ్ కు చెందిన నెక్ పాల్ అనే వ్యక్తి మృతి చెందినట్లు మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వివరాల్లోకి వెళితే కామారెడ్డికి చెందిన సామల వెంకటేశం, అతని కుమార్తె అక్షతలు చుక్కాపూర్ లక్ష్మీ నరసింహ స్వామిని

దర్శించుకొని కామారెడ్డికి వెళ్తుండగా పాల్వంచ మర్రి వద్ద బొలెరో వాహనం వెనుక నుంచి స్కూటీని ఢీ కొట్టింది. అనంతరం తప్పించుకునే ప్రయత్నంలో భవాని పేట నుంచి ముత్యంపేట్ వెళ్లే దారిలో అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్ల రోడ్డు మలుపు వద్ద వాహనం బోల్తా కొట్టింది. అదే సమయంలో అక్కడ ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. స్కూటీ పై వెళుతున్న తండ్రి కూతుళ్లు గాయపడ్డారు. ప్రమాదానికి కారకుడైన బొలెరో వాహనం డ్రైవర్ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.


Next Story

Most Viewed