అండర్‌–14 క్రికెట్‌లో విజేతగా కృష్ణా జట్టు | Sakshi
Sakshi News home page

అండర్‌–14 క్రికెట్‌లో విజేతగా కృష్ణా జట్టు

Published Sat, Jan 6 2024 2:02 AM

-

విజయవాడ స్పోర్ట్స్‌: సెంట్రల్‌ ఆంధ్రా అంతర జిల్లాల అండర్‌–14 క్రికెట్‌ లీగ్‌ బాలుర విజేతగా ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టు నిలిచింది. ఈ నెల మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పేరేచర్ల, నరసరావుపేటలో జరిగిన ఈ టోర్నీలో ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల జట్లు పాల్గొన్నాయి. శుక్రవారం జరిగిన ఫైనల్‌లో కృష్ణాజిల్లా జట్టు తన ప్రత్యర్థి గుంటూరుపై 41 పరుగుల తేడాతో విజయం సాధించి ఆరు పాయింట్లతో జోన్‌ విజేతగా నిలిచింది. విజేత జట్టును కృష్ణాజిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ అడహాక్‌ కమిటీ చైర్మన్‌ టి.త్రినాథరాజు, కన్వీనర్‌ శంకర్‌ అభినందించారు.

Advertisement
Advertisement