సీఎం జగన్‌కు సీఐటీయూ స్ట్రాంగ్ వార్నింగ్

by Disha Web Desk 16 |
సీఎం జగన్‌కు సీఐటీయూ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, మంత్రాలయం రూరల్/ కౌతాళం: కౌతాళంలో అంగన్వాడీల సమ్మె 26వ రోజుకు కొనసాగుతుంది.వీరికి మద్దతుగా సీఐటీయూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ మాట్లాడుతూ అధికారులు బెదిరించినా, రాజకీయ నాయకులకు భయపడకుండా అంగన్‌వాడీలందరూ సమ్మెలో ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కారించాలని రాధాకృష్ణ డిమాండ్ చేశారు.


అంగన్వాడీలను, కార్యకర్తలను కొంతమంది నాయకులు భయపెట్టాలని చూశారని రాధాకృష్ణ ఆరోపించారు. ఆయినా వెనక్క తగ్గకుండా అంగన్‌వాడీలు సమ్మెలో పాల్గొంటున్నారని చెప్పారు. ప్రభుత్వం పట్టింపు ధోరణికి పోకుండా అంగన్వాడీల వేతనాలు పెంచాలని కోరారు. లేని పోని చట్టాలు ప్రయోగించి వేధింపులకు గురి చేస్తే సీఎం ప్యాలెస్‌ను ముట్టడిస్తామని రాధాకృష్ణ హెచ్చరించారు.


Next Story

Most Viewed