పల్లెల్లో పేదలకు ‘స్పెషల్’ వైద్యం
వెల్దుర్తి(కృష్ణగిరి): ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో పల్లెల్లో పేద ప్రజలకు స్పెషలిస్టు వైద్య సేవలు అందుతున్నాయని ఏపీఎంఎస్ఐడీసీ (ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి మురళీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం వెల్దుర్తి బాలుర హైస్కూల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ వైద్య శిబిరాన్ని ఆయన తనిఖీ చేశారు. క్యాంప్లో అందిస్తున్న సేవలను తెలుసుకున్నారు. రోగుల వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేసి వారి ఆరోగ్య పరిస్థితులు ప్రభుత్వానికి తెలియజేయాలని సచివాలయ, ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. సేవలందిస్తున్న స్పెషలిస్టు వైద్యులు, కంటి వైద్య నిపుణులతో మాట్లాడారు. ఈసీజీ సేవలను పరిశీలించారు. దీర్ఘ కాలిక జబ్బులు, తీవ్ర అనారోగ్య పరిస్థితులున్న వారిని పెద్దాసుపత్రికి రెఫర్ చేసి ఉచితంగా అన్ని రకాల వైద్య సేవలు అందేలా చూడాలని డీఎంఅండ్హెచ్ఓ రాంగిడ్డయ్యను ఆదేశించారు. ప్యాపిలిలో ఆరోగ్య సురక్ష క్యాంప్ను పరిశీలించాలనని, అన్ని రకాల సౌకర్యాలతో నిర్వహిస్తున్నారన్నారు. వీటిని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రవీణ్కుమార్, డిప్యూటీ డీఈఎమ్ఓ చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సుంకన్న, సర్పంచ్ ముత్యాల శైలజ, ఎంపీడీఓ శ్రీనివాసరావ్, ఈఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు.