వై నాట్ షోరూం ప్రారంభం
ఏలూరు (ఆర్ఆర్పేట) : వినియోగదారులకు అందుబాటు ధరల్లో ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు అందిస్తూ వై నాట్ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ వినియోగదారుల మన్ననలు పొందుతుందని వైనాట్ ఎలక్ట్రానిక్స్, వైనాట్–హవెల్స్ ఇండియా లిమిటెడ్, లాయడ్ స్టేట్ హెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బి.హేమసుందర్ తెలిపారు. శనివారం అల్లవరం వద్ద కోడూరుపాడులో వైనాట్ ఎలక్ట్రానిక్స్, హెూమ్ అప్లయన్సెస్ షోరూంను హేమసుందర్ ప్రారంభించారు. సేల్స్ విభాగాన్ని ఐఎఫ్బీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ హోమ్ అప్లయన్సెస్ విభాగం బిజినెస్ హెడ్ డీకే అరుణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హేమసుందర్ మాట్లాడుతూ ఉభయ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో 29 షోరూంలు ఏర్పాటుచేసి అన్ని గృహెూపకరణాలు ఒకేచోట తక్కువ ధరలకు అందిస్తున్నామన్నారు. షోరూం అధినేత జుజ్జవరపు రాయుడు మాట్లాడుతూ పలు కంపెనీల ఉత్పత్తులు సామాన్యులకు అందుబాటు ధరలలో ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే లక్కీ డ్రాలో రిఫ్రిజిరేటర్ బహుమతిగా అందిస్తునట్లు తెలిపారు. కార్యక్రమంలో హయర్ బ్రాంచ్ మేనేజర్ సుధీర్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ బ్రాంచ్ మేనేజర్ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.