కార్ల మోడళ్లన్నీ అప్‌గ్రేడ్‌

ABN , First Publish Date - 2023-04-26T00:24:48+05:30 IST

కొత్తగా అమల్లోకి వచ్చిన బీఎస్‌ -6 కాలుష్య ప్రమాణాలకు దీటుగా మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) తన కార్లన్నింటినీ అప్‌గ్రేడ్‌ చేసింది.

కార్ల మోడళ్లన్నీ అప్‌గ్రేడ్‌

బీఎస్‌-6 రెండో దశ ప్రమాణాలకు

అనుగుణంగా మార్పులు: మారుతి సుజుకీ

న్యూఢిల్లీ: కొత్తగా అమల్లోకి వచ్చిన బీఎస్‌ -6 కాలుష్య ప్రమాణాలకు దీటుగా మారుతి సుజుకీ ఇండియా (ఎంఎ్‌సఐ) తన కార్లన్నింటినీ అప్‌గ్రేడ్‌ చేసింది. ప్రస్తుతం మార్కెట్లో 15 రకాల కార్లను మారుతి విక్రయిస్తోంది. హాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు, ఎంపీవీలు, ఎస్‌యూవీలు, వాణిజ్య వాహనాల శ్రేణిలోకి వచ్చే మోడళ్లనీ ఇప్పుడు బీఎస్‌-6 రెండో దశ కాలుష్య (రియల్‌ డ్రైవింగ్‌ ఎమిషన్స్‌-ఆర్‌డీఈ) ప్రమాణాలకు, ఈ-20 ఇంధనాలకు అనువుగా తయారైనట్టు సంస్థ ప్రకటించింది. ఈ కొత్త ఆర్‌డీఈ కార్లన్నింటిలోనూ కారు వదిలే కాలుష్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏదైనా లోపం ఉంటే డ్రైవర్లను అప్రమత్తం చేసే ఆన్‌బోర్డ్‌ డయాగ్నస్టిక్‌ (ఓబీడీ) సిస్టమ్‌ ఉన్నట్టు పేర్కొంది. అలాగే వాటిలో ఎలక్ర్టానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (ఈఎ్‌ససీ) వ్యవస్థలు కూడా ఉన్నట్టు తెలిపింది. కొత్త కాలుష్య ప్రమాణాలకు దీటుగా కార్లను అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు తాము మరింత మెరుగైన భద్రతా వ్యవ స్థ కోసం ఈఎ్‌ససీని కూడా అదనంగా ఏర్పాటు చేసినట్టు కంపెనీ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ సీవీ రామన్‌ తెలిపారు.

Updated Date - 2023-04-26T00:24:48+05:30 IST