నిలకడగా స్పీకర్ ఆరోగ్యం
ఆమదాలవలస: ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడంతో బీపీ, సుగర్ లెవెల్స్ పెరిగాయని, ముందస్తుగా వైద్యపరీక్షలు చేయించుకునేందుకు విశాఖ మెడికవర్ ఆస్పత్రికి రెండు రోజుల క్రితం వెళ్లానని పేర్కొన్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని కొందరు వ్యక్తులు వదంతులు పుట్టిస్తున్నారని, వాటిని నియోజవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరూ అధైర్యపడవద్దని, రెండురోజుల్లో మళ్లీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించి సహకరించాలని కోరారు.
మరిన్ని వార్తలు