రాజకీయాల్లో ఉన్నంత వరకూ వైఎస్సార్‌ సీపీతోనే..

మధురవాడ: నియోజకవర్గంలో తనపై జనసేన, టీడీపీ మైండ్‌ గేమ్‌ ఆడుతున్నాయని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ 7వ వార్డు వాంబేకాలనీలో శుక్రవారం ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవంతి శ్రీనివాసరావు ఇక్కడ పోటీ చెయ్యరని.. పార్టీలో ఉండరని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైఎస్సార్‌ సీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. చంద్రబాబు వచ్చినా.. పవన్‌ కల్యాణ్‌ వచ్చినా.. ఇక్కడ నుంచే పోటీ చేస్తానని, వైఎస్సార్‌ సీపీ జెండా ఎగురవేస్తానన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే అందరి లక్ష్యమన్నారు. జనసేన, టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చేస్తామని భ్రమపడి అధికారులను బెదిరిస్తున్నారని.. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు.

భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top