అలరించిన సంగీత విభావరి

సినీగీతాలను ఆలపిస్తున్న కళాకారులు  - Sakshi

శ్రీకాకుళం కల్చరల్‌: స్థానిక బాపూజీ కళామందిర్‌లో రంగస్థల కళాకారుల నెలవారీ సాంస్కృతిక విభాగం 291వ నెల కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన సినీ సంగీత విభావరి అలరించింది. ఆ పాత మధురాలను వీరాస్వామి, శ్రీనివాసరావు, చంటి, ప్రవీణ్‌ మంగవేణి, ప్రభావతి, రాజేశ్వరిలు వీనులవిందుగా ఆలపించారు. ఈ సందర్భంగా పౌరాణిక నటుడు, పద్మశ్రీ యడ్ల గోపాలరావు, డీఎస్పీ సీహెచ్‌.జి.వి.ప్రసాదరావు, ఆర్‌.శివరాంలు మాట్లాడుతూ పేద కళాకారులకు నెలవారీ పింఛన్లు పంపిణీ చేయడం గొప్పవిషయమన్నారు. బలివాడ పద్మలక్ష్మీ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బలివాడ శ్రీనివాసరావును సమాఖ్య సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో సమాఖ్య గౌరవ అధ్యక్షుడు ఎల్‌.రామలింగస్వామి, కార్యనిర్వాహక అధ్యక్షుడు పన్నాల నర్సింహమూర్తి, కార్యదర్శి బి.రామచంద్రదేవ్‌, రమణారావు, పైడి సత్యవతి, కంచరాన అప్పారావు పాల్గొన్నారు.

Read latest Srikakulam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top